* 15.12.2019న మన ఆంధ్రప్రభ ఆదివారం అనుబంధంలో ప్రచురించబడిన మాఊరు కొత్త రేమల్లె గురించి ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* జనవరి-2020 తెలుగు వెలుగులో వచ్చిన కథావిజయం-2019 బహుమతి కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.!
.
* తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వారి మెగా కన్వెన్షన్ సావనీర్–2022 పుస్తకంలో చోటు దక్కించుకున్న కథ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Content

పరిచయం

శ్రీ.దొండపాటి కృష్ణ
             దొండపాటి గోవర్ధనరావు, రంగమ్మ దంపతుల నాలుగో సంతానం (రెండో  కొడుకు). విద్యమీద అమితమైన మక్కువతో తాను చదువుకోకపోయినా తన కొడుకునైన చదివించాలన్న పట్టుదలతో కూలి పనులకు వెళ్తూ తండ్రి చదివించడం, సంస్కృతి సంప్రదాయాల గురించి నొక్కి చెప్పడంతో సాహిత్యం మీద అభిమానం పెంచుకున్నాను.

పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎం.సి.ఏ) కోసం కాకినాడ జే.ఎన్.టి.యు.కి వెళ్ళడంతో ఆయన సాహిత్య ప్రయాణం మొదలైంది. శ్రీ. చెరుకువాడ సత్యనారాయణ (సి.యస్) గారిని గురువుగా స్వీకరించి ఆయన శిష్యరికంలో జనరంజకమైన కథలు రాయడం నేర్చుకున్నాను. నా మొదటి కథాసంపుటి పేరు రాతి గుండెలో నీళ్ళు (35 యేళ్ళలోపు).

  05 మార్చ్, 2018న జాగృతి వారపత్రికలో నా మొదటి కథ స్పందించిన మనస్సు ప్రచురితమైంది. ఆరోజు నుంచి నేటిదాకా అనేక ప్రముఖ దిన, వార, మాసపత్రికల్లో యాభైకి పైగా కథలు ప్రచురితమయ్యాయి. అందులో ఎనిమిది కథలు బహుమతులు పొందాయి.

            కథ సామాజిక ప్రయోజనం కలిగించేదిగా ఉండాలని బలంగా నమ్ముతాను. కథ వలన మంచి జరుగకపోయినా ఫర్వాలేదు. కానీ, చెడు మాత్రం జరగకూడదు. అందుకే నా కథల్లో అసభ్య పదజాలంగానీ, రెచ్చగొట్టే సంఘటనలుగానీ, తప్పుదోవ పట్టించే సందేశాలుగానీ మచ్చుకైనా కనిపించవు. సామాజిక కథలు, మానవత్వపు కథలు, సందేశాత్మక కథలు, కుటుంబ కథలు రాయడానికే ఎక్కువ మక్కువ చూపుతాను.

            రాతిగుండెలో నీళ్ళు కథ రచయితగా నాకు గుర్తింపునిస్తే రాముడు–భీముడు అనేకథ తెలంగాణ అమెరికా తెలుగు సంఘం వారి మెగా కన్వెన్షన్ సావనీర్ – 2022 పుస్తకంలో చోటు దక్కించుకుని విశ్వమంతా సత్తా చాటింది.

            భార్య స్వప్న MA Telugu (ఎం.ఏ – తెలుగు) చదివి సాహిత్యంవైపు ప్రయాణం ప్రారంభించారు. నాకు తగు సలహాలు సూచనలు అందిస్తోంది. కుమారులు విశ్వజిత్, రితిన్.

 సాహిత్యంలో నాకు వెన్నుదన్నుగా ఉంటూ నన్ను ప్రభావితం చేసిన వ్యక్తులు:

01. శ్రీ. చెరుకువాడ సత్యనారాయణ (సి.యస్) గారు

02. శ్రీమతి. సుజాత తిమ్మన గారు

03. శ్రీమతి. నండూరి సుందరీ నాగమణి గారు

04. శ్రీమతి. భావరాజు పద్మినీ గారు

05. శ్రీ. ఆర్.సి. కృష్ణస్వామి రాజు గారు

06. శ్రీ. పెమ్మరాజు విజయ రామచంద్ర గారు

07. శ్రీ. డా. జడా సుబ్బారావు గారు

08. శ్రీ. కృపాకర్ పోతుల గారు

09. శ్రీ. ఉమా మహేష్ ఆచాళ్ళ గారు

10. శ్రీ. తల్లాప్రగడ గోపాల కృష్ణ (విరించి) గారు

11. శ్రీ. కేశిరాజు వెంకట వరదయ్య గారు

12. శ్రీ. కరసాల శ్రీనివాస్ గారు

13. శ్రీ. చాగంటి ప్రసాద్ గారు

14. శ్రీ. ఎమ్వీ రామిరెడ్డి గారు

15. శ్రీ. బాడిశ హనుమంతురావు (బాహారా) గారు

         

శ్రీ. చెరుకువాడ సత్యనారాయణ (C.S)
శ్రీమతి. సుజాత తిమ్మన 
 
శ్రీమతి. నండూరి సుందరీ నాగమణి
శ్రీ. ఆర్. సి. కృష్ణస్వామి రాజు

 
శ్రీ. డా. జడా సుబ్బారావు
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
ఇక చివరగా నాకు అత్యంత ఆప్తులు, నన్ను నిత్యం తరుముతూ ఉండే పూజైలు, నేను నా మొదటి పుస్తకాన్ని అంకితం ఇచ్చిన మహనీయులు శ్రీ. మంత్రిప్రగడ సుబ్బరాయ బోస్, లక్ష్మిల దంపతులు. వాళ్ళ ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. వాళ్ళకెప్పుడూ రుణపడి ఉంటాను. అంతేకాకుండా నాకు పరోక్షంగా సాయం చేసిన మిత్రులకు, నా పాఠకులకు కృతఙ్ఞతలు తెలియజేస్తున్నాను.

0 comments:

Post a Comment

మీ అమూల్యమైన సలహాలు సూచనల కోసం...